Jump to content

High court tirpu - yellow batch bonku


Hydrockers

Recommended Posts

పీపీఏలపై హైకోర్టు తీర్పుతో అయినా సీఎం జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు. టీడీపీపై తప్పుడు నిందలు వేశారన్నది హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు. పరిపాలనలో జగన్ 3 అడుగులు ముందుకెళ్తే.. 6 అడుగులు వెనక్కి వస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళావెంకట్రావ్, కొనకళ్ల నారాయణ, బొండా ఉమ మాట్లాడారు. టీడీపీపై కక్ష సాధింపు తప్ప అభివృద్ధి కోసం ఒక్క ఆలోచనా జగన్ చేయడం లేదని దుయ్యబట్టారు. ముడుపులు డిమాండ్ చేయడం కోసమే జీవో 63 జారీ చేశారని కొనకళ్ల నారాయణ ఆరోపించారు. పీపీఏలపై హైకోర్టు తీర్పు చెంప పెట్టు అని పేర్కొన్నారు. పరిపాలనపై జగన్‌కు ఉన్న అవగాహన ఇక్కడ బయటపడిందన్నారు. ప్రభుత్వ అసమర్థతకు కోర్టు తీర్పు నిదర్శనం అని అన్నారు. పీపీఏలపై ఎవరెన్ని చెప్పినా రివర్స్‌లో వెళ్లి భంగపడ్డారంటూ సీఎం జగన్‌పై టీడీపీ నేత బొండా ఉమ సెటైర్లు వేశారు. జగన్ చర్యల ఫలితంగా రాష్ట్రం నుంచి చాలా పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. వచ్చే వాళ్లూ రావటం లేదని అన్నారు.

Link to comment
Share on other sites

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో విజయం సాధిస్తూ ముందుకు పోతున్నారు. అధికారం చేపట్టగానే ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పిపిఏలలో భారీ ఎత్తున అవినీతి  జరిగిందని ఆరోపించింది వైసీపీ ప్రభుత్వం. విద్యుత్ పిపిఏలపై పునఃసమీక్షకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది జగన్ సర్కారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా పిపిఏలపై పునః సమీక్ష సరికాదని - దీంతో విద్యుత్ సంస్థలు ఇబ్బందులు పడుతాయని - మరెవరు ముందుకు రారని చెపుతూ ఏపీ విజ్ఞప్తిని తిరస్కరించింది.
 

అయినా పట్టువదలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండానే టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాల్సిందే... అనే సంకల్పంతో హైకోర్టును ఆశ్రయించింది. పిపిఏలపై పునః సమీక్ష చేయాలన్న నిర్ణయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు - నేతలు చిలువలు పలువలు చేసి రాద్ధాంతం చేశారు. అసలు పిపిఏలలో అవినీతే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం పిపిఏలలో యూనిట్ కు అధికంగా ఇస్తుందని ఆనాటి నుంచి ఆరోపిస్తూనే ఉంది.

పిపిఏలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది సర్కారు. హైకోర్టు కూడా సర్కారు నిర్ణయాన్ని సమర్ధించింది.. దీంతో వైసీపీ ప్రభుత్వంకు ఓ విజయం దక్కిందనే చెప్పవచ్చు. ఏపీ సర్కారు వేసిన పిటిషన్లను సమర్థిస్తూ - పిపిఏలపై పునః సమీక్ష అంశంపై హైకోర్టు లో విద్యుత్ కంపెనీలకు ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని మళ్లీ  పరిశీలించే అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏలను పునః సమీక్షించేందుకు ఏపీఈఆర్సీకి వెళ్తామన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు సమర్ధించింది. పీపీఏల పునః సమీక్షను ఏపీఈఆర్సీ ముందే నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

ఏపీఈఆర్సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్దారించలేమని చెప్పింది హైకోర్టు.  ఆరునెల్లలోగా ఈ వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ తేల్చాలని కూడా సూచించింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుల కింద యూనిట్ కి రూ.2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. మొత్తానికి విద్యుత్ కొనుగోలు పిపిఏలలో వైసీపీ ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తే భారీ అవినీతి అక్రమాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు.. మొత్తానికి జగన్ సర్కారు ఒక్కో ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ సర్కారు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తు చంద్రబాబును దోషిగా ప్రజల ముందు నిలిపే పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టే ఉంది

Link to comment
Share on other sites

అమరావతి: పీపీఏల పునఃసమీక్ష వ్యవహారంలో విద్యుత్‌ కంపెనీలకు ఎదురుదెబ్బ తాకింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్‌ కంపెనీల వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా.. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లపై పునఃసమీక్షకోసం ఏపీఈఆర్‌సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్‌సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది.
(అందుకే విద్యుత్‌ ఒప్పందాల పునఃసమీక్ష : అజేయ కల్లం)

ఏపీఈఆర్‌సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని హైకోర్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్‌సీకి స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది.  ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టంప్రకారం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను తిరిగి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

Link to comment
Share on other sites

విద్యుత్ పిపిఎల పునఃసమీక్ష కు సంబందించి ఎపి ప్రభుత్వం జారీ చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు జిఓని హైకోర్టు తోసి పుచ్చింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తాత్కాలికంగా చెల్లింపులు జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే టారిఫ్ కు సంబందించిన సమస్యను ఆరు నెలల్లో టారిఫ్ సమస్యను పరిష్కరించలని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు హైకోర్టు ఆదేశించింది. గత ప్రభుత్వం పిపిఎ లలో అక్రమాలకు పాల్పడింది. పాఇకేళ్ల పాటు అదిక ధరలకు కొనుగోలు చేసే ఒప్పందాలు చేసుకుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రబుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ జిఓని హైకోర్టు కొట్టివేసింది.అయితే పిపిఎల సమీక్షకు ఎపి ఈఆర్సికి వెళతామన్న ప్రభుత్వ వాదనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.పునః సమీక్ష కు అవకాశం లేదన్న విద్యుత్ సంస్థల వాదనను హైకోర్టు పూర్వపక్షం చేసినట్లు అయింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...