Jump to content

J-tax


psycopk

Recommended Posts

71900917_2938089886204583_16750592099027

దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని నెరవేరుస్తున్నానంటూ జగన్ గారు వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరదీశారు. ప్రతి క్వార్టర్‌ బాటిల్‌ ఎంఆర్‌పీపై అదనంగా రూ.20 పెంచి అమ్మడం ద్వారా నెలకు సుమారు రూ.50 కోట్లు, ఏడాదికి రూ.600కోట్లు, ఐదేళ్లకు రూ.3వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోడానికి పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. అలాగే పరిమిత బ్రాండ్లను మాత్రమే షాపుల్లో అమ్మిస్తూ... తెరవెనుక వాటి తయారీదారుల నుంచి 'జె-టాక్స్' వసూలు చేసుకుంటున్నారు. మద్యం అమ్మకాలు ఎంత పెరిగితే.. అంత మేర ‘జె’ ట్యాక్స్‌ కూడా పెరుగుతుంది. మద్యం షాపులు వైసీపీ నాయకుల భవనాల్లోనే ఏర్పాటు చేసి.. ప్రతి షాపునకు నెలకు రూ.80 వేలు చొప్పున అద్దె రూపంలో ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు, ఎక్సైజ్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఉన్నత విద్యావంతులను బ్రాందీ షాపుల్లో పెట్టి వాళ్లతో మద్యం అమ్మిస్తూ యువతరాన్ని అవమానిస్తున్నారు.

Link to comment
Share on other sites

72115580_2937520869594818_73151317724826

ఒక రాష్ట్ర ప్రభుత్వం పూచీ ఉంటానంటే ఎగిరి గంతేసి అప్పిస్తాయి బ్యాంకులు. అలాంటిది ఏపీపీఎఫ్‌సీఎల్‌ సంస్థకు రుణ మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం పూచీ ఇస్తామన్నప్పటికీ 'మీకు అప్పిస్తే తీర్చగలిగే శక్తి ఉందా?' అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సందేహం వ్యక్తం చేసింది. ఎంత సిగ్గు చేటు? రెండు లక్షల కోట్ల పై చిలుకు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి కేవలం రూ.3000 కోట్ల ఋణం పుట్టలేదంటే ఆ ప్రభుత్వం ఎంత దివాళాకోరు ప్రభుత్వమో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే జగన్ గారి విశ్వసనీయత పై నమ్మకం లేక అమరావతి నిర్మాణానికి 6,400 కోట్లు ఋణం ఇస్తామన్న ప్రపంచబ్యాంకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకుంది. ఆ వెంటనే ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (AIIB) కూడా రూ.1,380 కోట్ల సహాయాన్ని విరమించుకుంది. విశాఖ మెట్రోకి రూ.8300 కోట్ల భారీ రుణసహాయాన్ని ఇస్తామన్న కొరియన్ ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంకు (KEXIM) కూడా తన సాయాన్ని నిలిపేసింది.
జగన్ గారి ప్రభుత్వాన్ని ఏ మాత్రం నమ్మలేని స్థితికి బ్యాంకులు వచ్చాయంటే నాలుగు నెలల్లో రాష్ట్రాన్ని ఎంతగా దివాళా తీయించారో తెలుస్తోంది.

Link to comment
Share on other sites

72373758_2936171616396410_66832653278804

వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కంటి వెలుగు పథకం ప్రచార ఆర్భాటానికి తప్ప, ప్రజలకు ఉపయోగపడేదిలా లేదు. ఈ పథకం మార్గదర్శకాలను తెలుపుతూ గత సెప్టెంబర్ 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో 466 ప్రకారం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, టీచర్లు కంటి పరీక్షలు చేస్తారంట. డాక్టర్లు లేకుండా కంటి సమస్యలను గుర్తించడం ఏమిటో వైసీపీ ప్రభుత్వానికే తెలియాలి. అలాగే విటమిన్ -ఏ లోపంతో వచ్చే రేచీకటికి, చాలా మందిలో కనిపిస్తున్న కలర్ బ్లైండ్ నెస్ (రంగులు కనపడక పోవడం) జబ్బులకు ఇందులో చికిత్స లేదు. చూడబోతే ఇది కంటి వెలుగు పథకంలా కాకుండా ప్రచారం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టిన కంటి తుడుపు పథకంలా ఉంది.
 

Link to comment
Share on other sites

73292363_2933885039958401_67777400656332

తెదేపా హయాంలో విద్యుత్తును యూనిట్ కు రూ.4.50లు పెట్టి కొంటే రాష్ట్రం నష్టపోయిందని జగన్ గారితో సహా ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. కొందరు అధికారులతో ప్రెస్ మీట్ లు పెట్టించి మరీ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని చెప్పించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం యూనిట్ కు రూ.11.68లు చొప్పున ఎలా కొంటోంది? రాష్ట్రానికి నష్టం తెస్తోంది ఎవరు? వైసీపీ తుగ్లక్ చర్యల నష్టాన్ని రాష్ట్ర ప్రజలు భరించాలా?

Link to comment
Share on other sites

72625712_2934211136592458_23541610219265ఒడిశాలోని మహానది కోల్డ్ ఫీల్డ్స్ నుండి ప్రాథమిక ధరకే అంటే 1,600లకే టన్ను బొగ్గు దొరుకుతోంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నుండి టన్నుకు రూ.3,710లు చెల్లించి బొగ్గు కొంటోంది. ఇది ఎవరి మేలు కోసం?
 

Link to comment
Share on other sites

70908133_2933632106650361_14607723221588వార్డు సచివాలయ సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌-2) పోస్టులకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రీ లేదా ఆపై చదివినవారు అర్హులన్నారు. దీంతో బీకాం, బీఈడీ, ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ చదివినవారు దరఖాస్తు చేసుకున్నారు. కష్టపడి చదివి పరీక్ష పాసై ఉద్యోగానికి ఎంపికైనట్లు నియామక పత్రాలు అందుకున్న తర్వాత... మీ అర్హతలు చెల్లవు, మీకు ఉద్యోగాలు లేవంటోంది ప్రభుత్వం.
అటు చూస్తే జగన్ గారు మేము నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చేసాం అని తెగ ప్రచారం చేసేసుకుంటున్నారు. కనీసం పరీక్షలు సజావుగా నిర్వహించి ఉద్యోగాలివ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాదా? నిరుద్యోగులతో ఎందుకిలా ఆడుకుంటున్నారు? ఉద్యోగంలో చేరేలోపే వారికి అన్యాయం చేస్తారా? ఇదేం ఖర్మ?

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

73292363_2933885039958401_67777400656332

తెదేపా హయాంలో విద్యుత్తును యూనిట్ కు రూ.4.50లు పెట్టి కొంటే రాష్ట్రం నష్టపోయిందని జగన్ గారితో సహా ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. కొందరు అధికారులతో ప్రెస్ మీట్ లు పెట్టించి మరీ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని చెప్పించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం యూనిట్ కు రూ.11.68లు చొప్పున ఎలా కొంటోంది? రాష్ట్రానికి నష్టం తెస్తోంది ఎవరు? వైసీపీ తుగ్లక్ చర్యల నష్టాన్ని రాష్ట్ర ప్రజలు భరించాలా?

Exchange Price
YESTERDAY :
3.05  ₹/Unit
CURRENT :
3.16  ₹/Unit
 
Emi vaya samara, manaki etlago facts and realities tho sambandham vundadu....atla ani PPT lo pade prati okka vishayam correct ae decide ayipoi, fake and lies propagate cheyadam endi vaya ? 
  • Haha 1
Link to comment
Share on other sites

25 minutes ago, Android_Halwa said:

enti, 6 months ayinda ?

Seems samara is back to action, doing what he knows the best...

#Bhajana

yeah 6 months ayindi...PPT's shuru miya....

NOW-GAME-STARTS.gif

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...