Jump to content

అమరావతిలో... అప్పుడు, ఇప్పుడు By Boothu kittu


snoww

Recommended Posts

అమరావతి : రాజధానిని మార్చొద్దంటూ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళ‌న‌లు ఉధృతంగా కొన‌సాగుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ప‌ద్ధ‌తిలో సేక‌రించిన‌ భూములను వెన‌క్కి ఇచ్చేస్తామ‌ంటూ మంత్రులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌రింత అనిశ్చితి నెలకొంది. మూడు రాజ‌ధానులంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్య‌మంత్రి చేసిన ప్రతిపాదన త‌ర్వాత మొద‌లైన నిర‌స‌న‌లు ఇప్పుడు మ‌రింత ఉధృత‌ంగా కొనసాగుతున్నాయి.
 
క్రితం... అమ‌రావ‌తి ప్రాంతంలో రైతుల నుంచి ప్ర‌భుత్వం భూములు తీసుకుంటోందంటూ కొందరు ఆందోళ‌న‌లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం... ఆ భూములను వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని చెబుతుండ‌డం నిర‌స‌న‌ల‌కు కార‌ణమవుతోంది. కాగా... గత అయిదేళ్లలో అమ‌రావ‌తి ప్రాంతంలో భూముల ధరలు, ప్రస్తుత ధరలను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఇక... అమరావతి కోసం అప్పట్లో... లాండ్ పూలింగ్ విధానంలో... భూములనిచ్చందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
 
ఉండ‌వల్లి, పెన‌మాక వంటి కొన్ని గ్రామాల్లో మాత్రం ల్యాండ్ పూలింగ్‌ను రైతులు వ్య‌తిరేకించారు. ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టారు. అప్ప‌ట్లో వైసీపీ, జ‌న‌సేన నేత‌లు వారికి మ‌ద్దతుగా ధర్నాలు చేశారు. బ‌ల‌వంత‌పు భూస‌మీక‌ర‌ణ చేయొద్దంటూ డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ దగ్గర... జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో ఉన్న తాడేప‌ల్లితో పాటు ఉండ‌వ‌ల్లి వంటి గ్రామాల్లో అప్ప‌టికే భూముల ధ‌ర‌లు అధికంగా ఉన్నాయి.
 
రిజిస్ట్రేష‌న్ విలువ గజానికి 2014 లో రూ. 5 వేలు ఉండగా... ఉండ‌వ‌ల్లిలో ఎక‌రం రూ. 24 ల‌క్ష‌లుగా ఉంది. విజ‌య‌వాడ‌కు దూరంగా ఉన్న తుళ్లూరు మండ‌లం ప‌రిధిలోని కొన్ని గ్రామాల్లో అప్పటి రిజిస్ట్రేష‌న్ విలువ కేవ‌లం రూ. 3 ల‌క్ష‌లుగా మాత్రమే ఉంది. అప్పటి ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం... రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులంద‌రికీ స‌మానంగా కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే... జ‌రీబు, మెట్ట భూములు అన్న వ్య‌త్యాస‌మే త‌ప్ప మిగిలిన విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదన్న అభిప్రాయాలున్నాయి. దాంతో నేల‌పాడు వంటి గ్రామాల్లో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోయాయి.
 
అయితే... అప్ప‌టికే అత్య‌ధిక ధ‌ర‌లు ఉన్న తాడేప‌ల్లి మండ‌లంలోని కొన్ని గ్రామాల రైతుల‌కు పెద్దగా ప్ర‌యోజ‌నం జరగలేదు. దీంతోపాటు ప‌లు ఇతర అంశాలు, పరిస్థితుల నేపధ్యంలో... విజ‌య‌వాడకు సమీపంలోనే ఉన్న గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు అప్పుడు నిరాక‌రించారు. చివ‌ర‌కు సీడ్ యాక్సెస్ రోడ్డు వంటివి కూడా అసంపూర్ణంగా మిగిలిపోవ‌డానికి ఈ పరిస్థితి కార‌ణమైందని భావించారు.
 
ఇక రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో నిత్యం పంట‌ల సాగుతో ఒకప్పటి దృశ్యాలే క‌నిపిస్తుండ‌గా, భూములిచ్చిన గ్రామాల్లో మాత్రం దానికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక... విజ‌య‌వాడ‌, గుంటూరు మ‌ధ్య‌లో స్థిరాస్తి రంగం ఇబ్బందులనెదుర్కొంటోందని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని క్రెడాయ్ విజ‌య‌వాడ యూనిట్ అధ్య‌క్షుడు ఆర్.స్వామి కోరారు.
 
‘మూడేళ్లుగా మార్కెట్ బాగోలేదు. అప్పుడు నోట్లర‌ద్దు దెబ్బ‌తీసింది. ఆ త‌ర్వాత జీఎస్టీ ప్ర‌భావం చూపింది. ఈ ఎనిమిది నెల‌లుగా ఇసుక కొర‌తతో స‌మ‌స్య‌ ఉంది. ఇప్పుడైనా కోలుకుంటామ‌నుకుంటే... సీఎం ‘మూడు రాజ‌ధానులు’ ప్రకటనతో కొనుగోలుదారులు వెన‌క్కి వెళ్ళిపోతున్నారు. మార్కెట్ అచేతనమైంది.
 
రూ. 35 లక్షల నుంచి రూ. 40 ల‌క్ష‌ల దాకా ఉండే డ‌బుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇప్పుడు రూ. 30 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. మంగ‌ళ‌గిరిలోని ప్రైమ్ లోకేష‌న్స్‌లో నిర్మితమైన అపార్ట్‌మెంట్లలో కూడా చ‌ద‌ర‌పు గ‌జం మొన్న‌టి వ‌ర‌కూ రూ. 6 వేలున్న ధర... ఇప్పుడు రూ. 3,800 లకు ప‌డిపోయింది. మొత్తంగా 40 శాతం త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి.
 
ఈ క్రమంలో... విజ‌య‌వాడ డెవ‌ల‌ప‌ర్స్ కోలుకోలేని ప‌రిస్థితి ఏర్పడుతోంది. రాజ‌ధాని కాక‌ముందే ఉండ‌వ‌ల్లిలో ఎక‌రం రూ. 1.50 కోట్ల వరకూ ఉండేది. అయితే... మారుమూల ప్రాంతాల్లో చ‌విటి నేల‌కు, సిరులు పండే పొలాల‌కు కూడా ఒక‌టే ధ‌రను నిర్ణ‌యించారు.
 
రాజ‌ధాని రాక‌తో అమరావతి ప్రాంతంలో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోయాయి. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం ఇచ్చిన ప్లాట్లు చూస్తే గ‌జం రూ. 65 వేల‌కు కూడా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది.
 
గ‌త ప్ర‌భుత్వ హయాంలో ఇక్కడ భూముల కొనుగోళ్ల‌కు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ప్ర‌భుత్వం మార‌డంతో ఆ ధ‌ర‌ల్లో మార్పు చోటుచేసుకుంది. న‌వంబ‌ర్‌లో గ‌జం రూ. 40 వేల వ‌ర‌కూ ఉండేది. ఇప్పుడు అది రూ. 15 వేల‌కు కూడా అమ్ముడుపోయే ప‌రిస్థితి లేదు.
 
Link to comment
Share on other sites

Yento manishi anevadu ila land value perugudu thaggudu lekka la tho ne sagam life nadipisthunnadu. Yevadi ye country,  state anthenduku village lo kuda sukam ledu. Yendo yemo. Yentha sampadinchina sarigga tension leni life aithe konalekapothunnadu ani @Kool_SRG antunde

Link to comment
Share on other sites

On 12/22/2019 at 12:57 AM, snoww said:
అమరావతి : రాజధానిని మార్చొద్దంటూ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళ‌న‌లు ఉధృతంగా కొన‌సాగుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ప‌ద్ధ‌తిలో సేక‌రించిన‌ భూములను వెన‌క్కి ఇచ్చేస్తామ‌ంటూ మంత్రులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌రింత అనిశ్చితి నెలకొంది. మూడు రాజ‌ధానులంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్య‌మంత్రి చేసిన ప్రతిపాదన త‌ర్వాత మొద‌లైన నిర‌స‌న‌లు ఇప్పుడు మ‌రింత ఉధృత‌ంగా కొనసాగుతున్నాయి.
 
క్రితం... అమ‌రావ‌తి ప్రాంతంలో రైతుల నుంచి ప్ర‌భుత్వం భూములు తీసుకుంటోందంటూ కొందరు ఆందోళ‌న‌లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం... ఆ భూములను వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని చెబుతుండ‌డం నిర‌స‌న‌ల‌కు కార‌ణమవుతోంది. కాగా... గత అయిదేళ్లలో అమ‌రావ‌తి ప్రాంతంలో భూముల ధరలు, ప్రస్తుత ధరలను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఇక... అమరావతి కోసం అప్పట్లో... లాండ్ పూలింగ్ విధానంలో... భూములనిచ్చందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
 
ఉండ‌వల్లి, పెన‌మాక వంటి కొన్ని గ్రామాల్లో మాత్రం ల్యాండ్ పూలింగ్‌ను రైతులు వ్య‌తిరేకించారు. ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టారు. అప్ప‌ట్లో వైసీపీ, జ‌న‌సేన నేత‌లు వారికి మ‌ద్దతుగా ధర్నాలు చేశారు. బ‌ల‌వంత‌పు భూస‌మీక‌ర‌ణ చేయొద్దంటూ డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ దగ్గర... జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో ఉన్న తాడేప‌ల్లితో పాటు ఉండ‌వ‌ల్లి వంటి గ్రామాల్లో అప్ప‌టికే భూముల ధ‌ర‌లు అధికంగా ఉన్నాయి.
 
రిజిస్ట్రేష‌న్ విలువ గజానికి 2014 లో రూ. 5 వేలు ఉండగా... ఉండ‌వ‌ల్లిలో ఎక‌రం రూ. 24 ల‌క్ష‌లుగా ఉంది. విజ‌య‌వాడ‌కు దూరంగా ఉన్న తుళ్లూరు మండ‌లం ప‌రిధిలోని కొన్ని గ్రామాల్లో అప్పటి రిజిస్ట్రేష‌న్ విలువ కేవ‌లం రూ. 3 ల‌క్ష‌లుగా మాత్రమే ఉంది. అప్పటి ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం... రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులంద‌రికీ స‌మానంగా కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే... జ‌రీబు, మెట్ట భూములు అన్న వ్య‌త్యాస‌మే త‌ప్ప మిగిలిన విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదన్న అభిప్రాయాలున్నాయి. దాంతో నేల‌పాడు వంటి గ్రామాల్లో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోయాయి.
 
అయితే... అప్ప‌టికే అత్య‌ధిక ధ‌ర‌లు ఉన్న తాడేప‌ల్లి మండ‌లంలోని కొన్ని గ్రామాల రైతుల‌కు పెద్దగా ప్ర‌యోజ‌నం జరగలేదు. దీంతోపాటు ప‌లు ఇతర అంశాలు, పరిస్థితుల నేపధ్యంలో... విజ‌య‌వాడకు సమీపంలోనే ఉన్న గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు అప్పుడు నిరాక‌రించారు. చివ‌ర‌కు సీడ్ యాక్సెస్ రోడ్డు వంటివి కూడా అసంపూర్ణంగా మిగిలిపోవ‌డానికి ఈ పరిస్థితి కార‌ణమైందని భావించారు.
 
ఇక రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో నిత్యం పంట‌ల సాగుతో ఒకప్పటి దృశ్యాలే క‌నిపిస్తుండ‌గా, భూములిచ్చిన గ్రామాల్లో మాత్రం దానికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక... విజ‌య‌వాడ‌, గుంటూరు మ‌ధ్య‌లో స్థిరాస్తి రంగం ఇబ్బందులనెదుర్కొంటోందని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని క్రెడాయ్ విజ‌య‌వాడ యూనిట్ అధ్య‌క్షుడు ఆర్.స్వామి కోరారు.
 
‘మూడేళ్లుగా మార్కెట్ బాగోలేదు. అప్పుడు నోట్లర‌ద్దు దెబ్బ‌తీసింది. ఆ త‌ర్వాత జీఎస్టీ ప్ర‌భావం చూపింది. ఈ ఎనిమిది నెల‌లుగా ఇసుక కొర‌తతో స‌మ‌స్య‌ ఉంది. ఇప్పుడైనా కోలుకుంటామ‌నుకుంటే... సీఎం ‘మూడు రాజ‌ధానులు’ ప్రకటనతో కొనుగోలుదారులు వెన‌క్కి వెళ్ళిపోతున్నారు. మార్కెట్ అచేతనమైంది.
 
రూ. 35 లక్షల నుంచి రూ. 40 ల‌క్ష‌ల దాకా ఉండే డ‌బుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇప్పుడు రూ. 30 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. మంగ‌ళ‌గిరిలోని ప్రైమ్ లోకేష‌న్స్‌లో నిర్మితమైన అపార్ట్‌మెంట్లలో కూడా చ‌ద‌ర‌పు గ‌జం మొన్న‌టి వ‌ర‌కూ రూ. 6 వేలున్న ధర... ఇప్పుడు రూ. 3,800 లకు ప‌డిపోయింది. మొత్తంగా 40 శాతం త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి.
 
ఈ క్రమంలో... విజ‌య‌వాడ డెవ‌ల‌ప‌ర్స్ కోలుకోలేని ప‌రిస్థితి ఏర్పడుతోంది. రాజ‌ధాని కాక‌ముందే ఉండ‌వ‌ల్లిలో ఎక‌రం రూ. 1.50 కోట్ల వరకూ ఉండేది. అయితే... మారుమూల ప్రాంతాల్లో చ‌విటి నేల‌కు, సిరులు పండే పొలాల‌కు కూడా ఒక‌టే ధ‌రను నిర్ణ‌యించారు.
 
రాజ‌ధాని రాక‌తో అమరావతి ప్రాంతంలో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోయాయి. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం ఇచ్చిన ప్లాట్లు చూస్తే గ‌జం రూ. 65 వేల‌కు కూడా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది.
 
గ‌త ప్ర‌భుత్వ హయాంలో ఇక్కడ భూముల కొనుగోళ్ల‌కు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ప్ర‌భుత్వం మార‌డంతో ఆ ధ‌ర‌ల్లో మార్పు చోటుచేసుకుంది. న‌వంబ‌ర్‌లో గ‌జం రూ. 40 వేల వ‌ర‌కూ ఉండేది. ఇప్పుడు అది రూ. 15 వేల‌కు కూడా అమ్ముడుపోయే ప‌రిస్థితి లేదు.
 

Orey boothu kittu gaa. Rates padipoyayi, no one coming forward to buy Ani nee daggara proof vunda. 10 Mandi 100 septharu anta Ani. 

Proof vunte sellers list veyye. Proofs lekunda why are you crying on poor farmers lands and spreading fake news. Don't live pathetic life.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...