Jump to content

జీఎన్‌రావు రిపోర్ట్ మార్చేసిన బొత్స‌


TokyoJaani

Recommended Posts

విశాఖ రాజ‌ధానిగా ప‌నికిరాద‌ని జీఎన్ రావు క‌మిటీ ఇచ్చిన రిపోర్టు క‌ల‌క‌లం రేపుతోంది. వాస్త‌వంగా జీఎన్‌రావు నివేదికను పూర్తిగా మార్చేశార‌ని, ఇది మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌నేన‌ని జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. తాను చెప్పిన‌ట్టే జీఎన్ రావు నివేదిక ఇచ్చార‌ని అనుకున్న జ‌గ‌న్ ..తీరా నివేదిక‌లోప‌లి అంశాలు చూసి షాక్ అయ్యారు. వెంట‌నే అజ‌య్ క‌ల్లంతో జ‌గ‌న్ ఓ నివేదిక రూపొందించి దానిపై జీఎన్ రావుతో సంత‌కం చేయించేశారు. ఇక్క‌డితో ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ వేస్తే బాగుండేది. జీఎన్‌రావు క‌మిటీ విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటుకు ప‌రిస్తితులు అనుకూలంగా లేవ‌ని ఎందుకు నివేదిక‌లో ప్ర‌స్తావించారో జ‌గ‌న్‌కి అర్థం కాలేదు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు బోస్ట‌న్ క‌మిటీని నియ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి తాను అనుకున్న విధంగా నివేదిక త‌యారు చేయించుకుని అసెంబ్లీలో ఓకే చేయించుకున్నారు. అయితే శాస‌న‌మండ‌లిలో మూడు రాజ‌దానులు బిల్లు, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లు సెలెక్ట్ క‌మిటీకి వెళ్ల‌డం, కోర్టు జీఎన్ రావు నివేదిక బ‌య‌ట‌పెట్ట‌డంతో ఈ విష‌యాలు వెలుగుచూశాయి. జీఎన్ రావు నివేదిక స్థానంలో అజ‌య్‌క‌ల్లం నివేదిక పెట్టి టాంప‌రింగ్ చేసినా..చివ‌రికి జీఎన్ రావు ఒరిజిన‌ల్ నివేదిక కోర్టుకు ఎలా వెళ్లింద‌ని జ‌గ‌న్ ఆరా తీయ‌గా విస్తుపోయే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఒత్తిడితోనే విశాఖ రాజ‌ధానిగా ప‌నికిరాద‌ని నివేదిక‌లో జీఎన్ రావు  పేర్కొన్నార‌నే సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. అలాగే స‌ముద్రాన్ని, తుఫాన్ల‌ను  బూచిగా చూపించి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రాజ‌ధాని పెట్టించుకునేందుకు బొత్స వేసిన ఎత్తుగ‌డ‌లో జీఎన్ రావు క‌మిటీ నివేదిక తారుమారైంద‌ని జ‌గ‌న్ ఆంత‌రంగికులు గుర్తించారు. అలాగే విశాఖ‌కు ఉత్త‌రాన‌, 50 కిలోమీట‌ర్ల దూరంలో అంటే క‌రెక్టుగా విజ‌య‌న‌గ‌రం ప్రాంతమే రాజ‌ధానిగా ఉండాల‌ని  జీఎన్ రావు నివేదిక‌లో పెట్టేలా బొత్స ప‌న్నిన వ్యూహం ఫ‌లించింది. విశాఖ రాజ‌ధానిని ఇలా విజ‌య‌న‌గ‌రానికి బొత్స త‌న్నుకుపోయేలా జీఎన్‌రావును ఎలా మార్చుకోగ‌లిగారో తెలియ‌క విజ‌య‌సాయి త‌ల ప‌ట్టుకుంటున్నారు. 

విజ‌య‌సాయికి విశాఖ‌లో, బొత్స‌కి విజ‌య‌న‌గ‌రంలో భూములు

స‌ముద్ర‌తీరం వెంబ‌డి దాదాపు 6 వేల ఎక‌రాలు ఇప్ప‌టికే త‌న గుప్పిట్లో పెట్టుకున్న విజ‌య‌సాయిరెడ్డి  విశాఖ రాజ‌ధానిగా నివేదిక‌లో  సూచించాల‌ని జీఎన్‌రావుకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు. నివేదిక ఎలా ఉండాలో కూడా వివ‌రించారు. అయితే జీఎన్‌రావుని మంత్రి బొత్స ఎలా ప్ర‌లోభ పెట్టారోగానీ విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే పూర్తిగా రాజ‌ధాని వ‌చ్చేలా నివేదిక వ‌చ్చింది. ఇది చూసి విజ‌య‌సాయి తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.  బొత్సకి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జీఎన్ రావు క‌మిటీ నివేదిక‌లో స్ప‌ష్టంగా పేర్కొన్న విశాఖ‌కు ఉత్త‌రాన 50 కిలోమీట‌ర్ల దూరంలో దాదాపు 10 వేల ఎక‌రాలు భూములు స‌మ‌కూర్చుకున్నార‌ని స‌మాచారం. దీంతో జీఎన్‌రావుని భారీగా తాయిలాలిచ్చి ప్ర‌లోభ‌పెట్టి మ‌రీ నివేదిక మార్పించార‌ని జ‌గ‌న్ కోర్ టీమ్ ప‌నిగ‌ట్టేసింది. దీంతో బొత్స‌పై గ‌రంగ‌రంగా ఉన్నారు.

Link to comment
Share on other sites

Bathroom Babai Murder scene malli repeat anamata.....

 

Botsa garu jagratha... asale meeru thathathatha antu ariste ..... killers thala meeda kottamantunaru anukuni thala meeda kathi dimputaru @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, Armanii said:

Bathroom Babai Murder scene malli repeat anamata.....

Botsa garu jagratha... asale meeru thathathatha antu ariste ..... killers thala meeda kottamantunaru anukuni thala meeda kathi dimputaru @3$%

83432534_599663947546988_156517101993564

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...