Jump to content

telu.gu media on AP Cap!tal


kidney

Recommended Posts

Central govt can question

రాజధానిలో కేంద్రం భాగస్వామే!
05-02-2020 03:52:30
 
 
  • అమరావతిలో ప్రతి అడుగూ పర్యవేక్షణ
  • కమిటీ వేసి..నిధులిచ్చింది మోదీ సర్కారే
  • అసెంబ్లీ ఏకగ్రీవతీర్మానానికి కేంద్రం ఓకే
  • రాజధాని కోసం 1500 కోట్లు సాయం
  • బెజవాడ-గుంటూరు డ్రైనేజీకి వెయ్యికోట్లు
  • తానూ భాగస్వామి కాబట్టే ఇంతటి కదలిక
  • రాష్ట్రంలోని పలువురు నిపుణుల స్పష్టీకరణ
 
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా రాష్ట్రాల రాజధానుల నిర్ణయం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదనేది నిర్వివాదాంశం. అయితే, ఒక రాష్ట్ర రాజధాని ఎంపిక నుంచి నిధుల కేటాయింపు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉంటే? కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి అభివృద్ది చేస్తే? పలు కేంద్ర సంస్థలు డబ్బులు చెల్లించి భూములు తీసుకుంటే?.. కచ్చితంగా అప్పుడు ఆ రాజధాని విషయంలో కేంద్రం కూడా భాగస్వామే అవుతుంది. రాజఽధాని అమరావతి విషయంలోనూ జరిగింది ఇదే! అమరావతిని రాజధాని ప్రాంతంగా ఏర్పాటుచేయాలని అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ ఆమోదం తర్వాతే అమరావతికి నిధులు విడుదల చేసింది. అంతేకాదు...అవసరాన్ని బట్టి అటవీ భూములను కూడా రాజధాని కోసం డీనోటిఫై చేసేందుకు అంగీకరించింది. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భూ కేటాయింపుకోసం డబ్బు కూడా చెల్లించాయి. అందుకే అమరావతి రాజధానిలో కేంద్రం కూడా భాగస్వామే అని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. 
 
 
చట్టం అదే చెప్పింది..
Link to comment
Share on other sites

Central govt cannot question

రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’

 

నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే

మూడు రాజధానులపై పార్లమెంట్‌లో తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం

ఏపీకి అదనపు బలగాలు పంపాల్సిన అవసరం లేదు

లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, విధానానికి కేంద్రం సంపూర్ణ మద్దతు

బెడిసికొట్టిన టీడీపీ రాజకీయ పన్నాగాలు 

ప్రజల్ని పక్కదారి పట్టించే యత్నాలు విఫలం

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి మద్దతు పలికింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...