ఏపీ సీఎం జగన్ రేపు మధ్యాహ్నం దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు.
ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకోవాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులపైనా ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లే వీలుంది. అనంతరం కేంద్రహోం మంత్రి అమిత్షాతో పాటు మరి క