Jump to content

జ‌గ‌న్‌..మ‌నిద్ద‌రం క‌లిసి దేశానికి ఆద‌ర్శంగా నిలుద్దాం!


r2d2

Recommended Posts

 

full.jpg
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు ఆస‌క్తిక‌ర ప్ర‌తిపాద‌న పెట్టారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మ‌ధ్య సుహృద్భావ సంబంధాలే ముఖ్య‌మని గ‌త కొద్దికాలంగా పేర్కొంటున్న గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా ఇందుకోసం కీల‌క నిర్ణ‌యం తీసుకొని...దేశానికి ఆద‌ర్శంగా నిలుద్దామ‌ని జ‌గ‌న్‌కు సూచించారు. ఇదంతా ఏపీ ప‌క్క రాష్ట్రమైన త‌మిళ‌నాడు విష‌యంలో తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణ‌యం.నీటి కొర‌త ఎదుర్కుంటున్న తమిళనాడు రాష్ట్రం త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆశ్ర‌యించింది. ప్రగతిభవన్‌లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, సలహాదారు ఎం.షీలా ప్రియ తదితరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయి తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్, ఒడిషా ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అధికారికంగా లేఖలు రాయాలని వారికి సూచించారు. 
అనంతరం మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయిలో సమావేశం జరపాలని, ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా నివేదిక తయారు చేయాలని కోరారు. తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులంతా ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా మారుతాయన్నారు.
తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య సహన పూరితమైన వాతావరణం ఉండాలని, పొరుగు రాష్ట్రాలు దయతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ సమావేశాల్లో తాను పలుమార్లు  లేవనెత్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే విషయంపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా రెండుసార్లు మాట్లాడారన్నారు. 
వాస్తవానికి తాగునీటి సమస్యతో తమిళనాడు బాధపడుతున్నందుకు దేశమంతా సిగ్గుపడాలన్నారు. దేశంలో లభించే మొత్తం 70 వేల టీఎంసీల నీటిలో సాగునీటి అవసరాలు తీర్చగా, మరో 30 వేల టీఎంసీల నీరు మిగిలే ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో కేవలం 10 వేల టీఎంసీల నీరు మాత్రమే దేశంలో తాగునీటి అవసరాలకు సరిపోతుందని అన్నారు.తాగునీటి విషయమై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని కలిగి ఉండాలని ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి సీఎం కేసీఆర్ సూచించారు. అత్యంత ప్రాధాన్యతా అంశమైన తమిళనాడు తాగునీటి అవసరాలపై దేశవ్యాప్తంగా అవగాహన అవసరమనీ, అందరూ సహృదయంతో అర్ధం చేసుకున్ననాడే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారతీయుడిగా తమిళనాడుకు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్  అన్నారు. తమిళనాడుకు తాగునీటి కోసం ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం అభ్యర్థన గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఇందుకు తాను సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని, ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు ప్రతినిధి బృందం సభ్యులకు తాను ఇచ్చిన సూచనలను జగన్ కు వివరించారు. తమిళనాడులో తాగునీటి బాధలు తెలిసిన విషయమే కాబట్టి, ఆ రాష్ట్రానికి నీరందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...