Jump to content

తితిదే ఆస్తుల విక్రయం నిలిపివేత భక్తుల మనోభావాల దృష్ట్యా పునఃసమీక్ష చేయాలని ప్రభుత్వ నిర్ణయం ఈనాడు - అమరావతి


afacc123

Recommended Posts

తితిదే ఆస్తుల విక్రయం నిలిపివేత

భక్తుల మనోభావాల దృష్ట్యా పునఃసమీక్ష చేయాలని ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు - అమరావతి

తితిదే ఆస్తుల విక్రయం నిలిపివేత

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తితిదే ఆస్తుల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం  పక్కనపెట్టింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దీనిపై పునఃసమీక్ష చేయాలని తితిదేను ఆదేశించింది. మతపెద్దలు, భక్తులతో మాట్లాడి ఆ భూములను ఆలయాల నిర్మాణం, ధర్మప్రచారం, మతపరమైన కార్యక్రమాల వంటివాటికి వినియోగించుకోవచ్చేమో పరిశీలించాలని సూచించింది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేవరకు ఆస్తుల విక్రయాలను నిలిపివేస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.   50ఆస్తుల విక్రయానికి సంబంధించి 2016 జనవరి 30న అప్పటి తితిదే పాలకవర్గం చేసిన తీర్మానం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. భక్తుల మనోభావాల దృష్ట్యా దానిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఎం వద్ద చర్చ
ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎంతో తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ వ్యవహారం పూర్వాపరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆస్తుల విక్రయాలు నిలిపేయాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

నిర్ణయమే తీసుకోలేదు: సుబ్బారెడ్డి
తితిదే భూముల వేలంపై తాము ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వేలం తేదీని కూడా ప్రకటించలేదని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చేతనైతే మా వంతు దేవుడికి కానుకగా  సమర్పించే ప్రయత్నం చేస్తాం గానీ, దేవుడి సొమ్ము ఆశించబోమన్నారు. తిరుమలకు సేవకులుగా ఉన్న తమకు రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు. సోమవారం మధ్యాహ్నం సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వచ్చాక, మా బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగా తితిదే ఆస్తులు అమ్మదలుచుకుంటే కేవలం రూ.1.53 కోట్లు విలువైన భూములే అమ్మాలా? అది కూడా తమిళనాడులోని మారుమూల గ్రామాల్లో ఉన్నవే విక్రయించాలా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మాకు దోచుకోవాలనే ఆలోచన ఉంటే ఇవే అమ్ముతామా? 2016లో అప్పటి బోర్డు ఆస్తుల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని సమీక్షించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని మాత్రమే అధికారులను ఆదేశించాం. ఆ భూముల్లో 5 సెంట్లలోపు స్థలాలు, ఎకరాన్నరలోపు వ్యవసాయ భూములు ఉన్నాయి. వేర్వేరుచోట్ల ఉన్న ఆ ఆస్తులను ఎలా పరిరక్షించాలనే మార్గాలను చూస్తాం. వచ్చే బోర్డు సమావేశంలో ఈ అంశంపై మరోసారి చర్చిస్తాం. ధార్మిక పెద్దలు, స్వామీజీల సలహాలు తీసుకుంటాం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించం’ అని చెప్పారు.

కోర్టుకెళ్లి భూములు కాపాడాం
గత తెదేపా ప్రభుత్వ హయాంలో సదావర్తి భూములు, తదితరాలను కొట్టేయాలని చూస్తే.. తాము ప్రతిపక్షంలో ఉన్నా  కోర్టుకెళ్లి వాటిని కాపాడామని సుబ్బారెడ్డి చెప్పారు. తెదేపా సర్కారు తిరుపతి నగరంలో గరుడ వారధికి రూ.460 కోట్లు, ఆవిలాల చెరువు సుందరీకరణకు రూ.120 కోట్లు తితిదే నిధులు కేటాయిస్తే.. మేం వచ్చాక వాటిని సమీక్షించామన్నారు. ‘తితిదేలో 1974 నుంచి 2014 వరకు 129 ఆస్తులు అమ్మారు. తెదేపా హయాంలో 1995 నుంచి 2003 వరకు 20 ఆస్తులు విక్రయించారు. 50 నిరర్ధక ఆస్తులు బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్‌గా ఉన్న బోర్డు 2016లో తీర్మానించింది. ఇలా వచ్చిన డబ్బును తితిదే కార్పస్‌ ఫండ్‌లో జమ చేయాలని దీనిపై అప్పట్లో ఆరుగురు తితిదే సభ్యులతో కూడిన ఉపసంఘం నివేదిక ఇచ్చింది. నాడు ప్రభుత్వంలోనూ, తితిదే బోర్డులోనూ భాజపా భాగస్వామి. కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్‌ కృష్ణారావు ఈ నిజాలు తెలుసుకోవాల్సింది’ అని సుబ్బారెడ్డి అన్నారు.

Link to comment
Share on other sites

Just now, afacc123 said:
తితిదే ఆస్తుల విక్రయం నిలిపివేత

భక్తుల మనోభావాల దృష్ట్యా పునఃసమీక్ష చేయాలని ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు - అమరావతి

తితిదే ఆస్తుల విక్రయం నిలిపివేత

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Skip
 
 

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తితిదే ఆస్తుల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం  పక్కనపెట్టింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దీనిపై పునఃసమీక్ష చేయాలని తితిదేను ఆదేశించింది. మతపెద్దలు, భక్తులతో మాట్లాడి ఆ భూములను ఆలయాల నిర్మాణం, ధర్మప్రచారం, మతపరమైన కార్యక్రమాల వంటివాటికి వినియోగించుకోవచ్చేమో పరిశీలించాలని సూచించింది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేవరకు ఆస్తుల విక్రయాలను నిలిపివేస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.   50ఆస్తుల విక్రయానికి సంబంధించి 2016 జనవరి 30న అప్పటి తితిదే పాలకవర్గం చేసిన తీర్మానం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. భక్తుల మనోభావాల దృష్ట్యా దానిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఎం వద్ద చర్చ
ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎంతో తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ వ్యవహారం పూర్వాపరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆస్తుల విక్రయాలు నిలిపేయాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

నిర్ణయమే తీసుకోలేదు: సుబ్బారెడ్డి
తితిదే భూముల వేలంపై తాము ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వేలం తేదీని కూడా ప్రకటించలేదని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చేతనైతే మా వంతు దేవుడికి కానుకగా  సమర్పించే ప్రయత్నం చేస్తాం గానీ, దేవుడి సొమ్ము ఆశించబోమన్నారు. తిరుమలకు సేవకులుగా ఉన్న తమకు రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు. సోమవారం మధ్యాహ్నం సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వచ్చాక, మా బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగా తితిదే ఆస్తులు అమ్మదలుచుకుంటే కేవలం రూ.1.53 కోట్లు విలువైన భూములే అమ్మాలా? అది కూడా తమిళనాడులోని మారుమూల గ్రామాల్లో ఉన్నవే విక్రయించాలా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మాకు దోచుకోవాలనే ఆలోచన ఉంటే ఇవే అమ్ముతామా? 2016లో అప్పటి బోర్డు ఆస్తుల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని సమీక్షించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని మాత్రమే అధికారులను ఆదేశించాం. ఆ భూముల్లో 5 సెంట్లలోపు స్థలాలు, ఎకరాన్నరలోపు వ్యవసాయ భూములు ఉన్నాయి. వేర్వేరుచోట్ల ఉన్న ఆ ఆస్తులను ఎలా పరిరక్షించాలనే మార్గాలను చూస్తాం. వచ్చే బోర్డు సమావేశంలో ఈ అంశంపై మరోసారి చర్చిస్తాం. ధార్మిక పెద్దలు, స్వామీజీల సలహాలు తీసుకుంటాం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించం’ అని చెప్పారు.

కోర్టుకెళ్లి భూములు కాపాడాం
గత తెదేపా ప్రభుత్వ హయాంలో సదావర్తి భూములు, తదితరాలను కొట్టేయాలని చూస్తే.. తాము ప్రతిపక్షంలో ఉన్నా  కోర్టుకెళ్లి వాటిని కాపాడామని సుబ్బారెడ్డి చెప్పారు. తెదేపా సర్కారు తిరుపతి నగరంలో గరుడ వారధికి రూ.460 కోట్లు, ఆవిలాల చెరువు సుందరీకరణకు రూ.120 కోట్లు తితిదే నిధులు కేటాయిస్తే.. మేం వచ్చాక వాటిని సమీక్షించామన్నారు. ‘తితిదేలో 1974 నుంచి 2014 వరకు 129 ఆస్తులు అమ్మారు. తెదేపా హయాంలో 1995 నుంచి 2003 వరకు 20 ఆస్తులు విక్రయించారు. 50 నిరర్ధక ఆస్తులు బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్‌గా ఉన్న బోర్డు 2016లో తీర్మానించింది. ఇలా వచ్చిన డబ్బును తితిదే కార్పస్‌ ఫండ్‌లో జమ చేయాలని దీనిపై అప్పట్లో ఆరుగురు తితిదే సభ్యులతో కూడిన ఉపసంఘం నివేదిక ఇచ్చింది. నాడు ప్రభుత్వంలోనూ, తితిదే బోర్డులోనూ భాజపా భాగస్వామి. కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్‌ కృష్ణారావు ఈ నిజాలు తెలుసుకోవాల్సింది’ అని సుబ్బారెడ్డి అన్నారు.

Idi lekka 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...