Jump to content

NRI lu maree intha VP laaa


snoww

Recommended Posts

అమ్మా... నాన్న.. ఓ అబ్బాయి

పెళ్లి చేసుకుంటామంటూ ప్రవాస భారతీయులకు వల

నాలుగేళ్లలో రూ.5కోట్లు దండుకున్న కుటుంబం

ఈనాడు, హైదరాబాద్‌:

అమ్మా... నాన్న.. ఓ అబ్బాయి

సులభంగా డబ్బు సంపాదించాలంటే జనాన్ని మోసం చేయాలి.. ఇక్కడివారైతే శ్రమ.. పోలీసులకు దొరికే అవకాశముంటుంది... విదేశాల్లో ఉన్నవారిని మోసం చేస్తే.. వారు ఫిర్యాదు చేసి.. పోలీసులు పట్టుకునేలోపు కొల్లగొట్టిన సొమ్మును మాయచేస్తే సరి..అని ఓ తల్లి, తండ్రి, కుమారుడు అనుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఉంటున్న మాళవిక, శ్రీనివాస్‌, ప్రణవ్‌లు ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపారు. పెళ్లి చేసుకుంటామంటూ అంతర్జాల వివాహవేదికలు భారత్‌ మ్యాట్రిమోని, తెలుగు మాట్రిమోనీల్లో వివరాలుంచి స్పందించిన వారితో ఫోన్‌లో మాట్లాడి ముహూర్తాలు సిద్ధం చేసుకుని.. పెళ్లి సమయంలో తమ విలువైన ఆస్తులు వివాదాల్లో ఉన్నాయని, కోర్టు కేసుల ఖర్చులంటూ రూ.లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. ఇలా నాలుగేళ్లలో రూ.5కోట్లు స్వాహా చేశారు. మోసపోయామని గ్రహించిన కొందరు ప్రవాసభారతీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న సుధీర్‌ తన వద్ద నుంచి రూ.3కోట్లు ఇప్పించుకున్నారంటూ పోలీసులకు వివరించగా.. సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు ప్రాథమిక ఆధారాలు సేకరించగా.. గత నెలలో జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన తల్లి, కుమారుడు మాళవిక, ప్రణవ్‌గా గుర్తించారు.

అనాథ శరణాలయం నిర్వహణ.. రూ.కోట్లలో ఆదాయం

 

అమెరికాలో ఉంటున్న సుధీర్‌ కృష్ణను మోసం చేసేందుకు మాళవిక తాను ఓ అనాథ శరణాలయ నిర్వాహకురాలిగా మూడేళ్ల క్రితం పరిచయం చేసుకుంది. విదేశాల నుంచి దాతలు, కేంద్ర ప్రభుత్వం నుంచి శరణాలయ నిర్వహణకు రూ.లక్షల్లో నిధులు వస్తున్నాయని, ఏటా రూ.5కోట్ల ఆదాయం వస్తుందని వివరించింది. మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదంటూ చెప్పింది. దీంతో సుధీర్‌ కృష్ణ హబ్సిగూడలో ఉంటున్న తన తండ్రికి విషయం వివరించగా.. ఆయన కూడా అంగీకరించాడు. పెళ్లి చేసుకుంటానని సుధీర్‌ చెప్పిన కొద్దిరోజులకే ముగ్గురు కలిసి మాయాజాలం ప్రదర్శించారు. దాతల నుంచి నిధులు రాలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు అందలేదంటూ రూ.5లక్షలు, రూ.10లక్షలు, రూ.15లక్షలు ఇప్పించుకునేవారు. సుధీర్‌కు అనుమానం రాకుండా తీసుకున్న డబ్బుకు వడ్డీ కూడా చెల్లిస్తానంటూ మాళవిక చెప్పేది. మూడేళ్లలో రూ.3కోట్లు ఇచ్చానని గ్రహించిన సుధీర్‌ డబ్బులెప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించగా.. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. తన తండ్రికి విషయం చెప్పగా.. అనాథ శరణాలయం కాగితాలపైనే ఉందని తెలుసుకున్నారు.

ఆస్తులు వివాదంలో ఉన్నాయని..

కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వరుణ్‌ను భారత్‌ మాట్రిమోనీ ద్వారా మాళవిక ఎనిమిది నెలల క్రితం సంప్రదించింది. జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్నామని, తండ్రి ఇటీవలే చనిపోయాడంటూ తెలిపింది. తమ ఆస్తులు వివాదంలో ఉన్నాయని, కేసుల్లో గెలవాలంటే న్యాయవాదులకు రూ.లక్షల్లో ఇవ్వాలని అభ్యర్థించింది. అతడు నమ్మడంతో ఆరునెలల్లో రూ.65లక్షలు కొల్లగొట్టారు. వరుణ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి గత నెల 27న మాళవిక, ప్రణవ్‌లను అరెస్ట్‌ చేశారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

Ee NRI hindus Antha ninamyina gods Jesus & allah ni nammithe itlanti problems ragù antunna Boston bro 

 

Nijanga nammuthe ilantivi avvadu

thanx @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...