Jump to content

రాజధానిపై ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి:గల్లా


DaatarBabu

Recommended Posts

అమరావతి: వైకాపా ప్రభుత్వానికి ఆలోచన, విజన్‌ లేదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జయదేవ్‌ మాట్లాడారు. అమరావతిని ప్రపంచశ్రేణి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని భావించామని.. కొత్త ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబుకు మంచిపేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారని గల్లా జయదేవ్‌ ఆరోపించారు. అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళల పోరాటం నిరుపమానమని.. ఇంకా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని సూచించారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే జైలుకు వెళ్లానని.. అమరావతి కోసం భవిష్యత్తులోనూ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిపై స్పందించాలని గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు.

images?q=tbn:ANd9GcR8R0LZCdNpaPzCsmkIxNI

Link to comment
Share on other sites

అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారు: జయదేవ్

అమరావతి: అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దాలని, టీడీపీ అధినేత చంద్రబాబు తపించారని ఎంపీ గల్లా జయదేవ్‌ కొనియాడారు. ప్రపంచం మొత్తం తిరిగి, పరిశీలించి.. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని తెలిపారు. ముందు చూపులేని సీఎం జగన్‌ అమరావతిని చంపాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టినందుకు.. తమ కుటుంబంపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. అమరావతిని ఎవరూ మార్చలేరని గల్లా జయదేవ్‌ స్పష్టం చేశారు. 

ఏపీ రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22న (విజయదశమి) మోదీ శంకుస్థాపన చేశారు. ఏపీ పరిపాలన భవన సముదాయానికి 2016 అక్టోబర్ 28న అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి అక్కడి నుంచి పరిపాలన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన వికేంద్రీకరణ కొరకు 2020 జులై 31న అమరావతిని కేవలం శాసనసభ రాజధానిగా పరిమితం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు.

Link to comment
Share on other sites

13 minutes ago, DaatarBabu said:

అమరావతి: వైకాపా ప్రభుత్వానికి ఆలోచన, విజన్‌ లేదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జయదేవ్‌ మాట్లాడారు. అమరావతిని ప్రపంచశ్రేణి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని భావించామని.. కొత్త ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబుకు మంచిపేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారని గల్లా జయదేవ్‌ ఆరోపించారు. అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళల పోరాటం నిరుపమానమని.. ఇంకా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని సూచించారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే జైలుకు వెళ్లానని.. అమరావతి కోసం భవిష్యత్తులోనూ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిపై స్పందించాలని గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు.

images?q=tbn:ANd9GcR8R0LZCdNpaPzCsmkIxNI

 

E punchprabhakar lk gadu... Pedda p fighter Mari....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...