Jump to content

ఎక్కడి రేషన్‌ బండ్లు అక్కడే.. రేషన్‌ పంపిణీకి ఆటంకం - thuglaq ruling


Somedude

Recommended Posts

ఎక్కడి రేషన్‌ బండ్లు అక్కడే.. రేషన్‌ పంపిణీకి ఆటంకం

ap-main11a_53.jpg

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: ఇంటింటికీ వెళ్లి సరుకులు పంపిణీ చేయలేమని రేషన్‌ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వాహనాల చోదకులు చేతులెత్తేస్తున్నారు. బియ్యం ఇళ్లకు తరలించేందుకు హమాలీ పని చేయలేమని కొందరు..వాహనాలు సందుల్లోకి వెళ్లడం లేదని కొందరు..ఇలా వివిధ కారణాలతో వాహన చోదకులు రేషన్‌ సరుకుల వాహనాలు నడపలేమని అధికారులకు చెప్పేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు రేషన్‌ అందించడం చాలా చోట్ల ఇబ్బందిగా మారుతోందనే మాట వినిపిస్తోంది.
వాహనాలు వదిలేసి..
పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించిన రేషన్‌ సరకుల డోర్‌ డెలివరీ కార్యక్రమానికి రెండో రోజే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ పని చేయలేమంటూ మినీ ట్రక్కు డ్రైవర్లు పలువురు వాహనాలను తీసుకువచ్చి తిరుపతిలో ఆర్డీవో, చిత్తూరులో డీఎస్‌వో ఆఫీసులో మంగళవారం వదిలిపెట్టారు. డీలర్లు డ్రైవర్ల చేతికి ఈ-పాస్‌ మిషన్లు, తూకపు పరికరాలు ఇవ్వడానికి చాలాచోట్ల ఒప్పుకోవడంలేదు. వీఆర్‌వోలు అయితే జవాబుదారీగా ఉంటుందని, వారికి మాత్రమే ఇస్తామంటూ షరతు పెట్టారు. కొన్నిచోట్ల ఇచ్చినా వాహనంతో పని చేసే హమాలీ రెండో రోజు జారుకున్నారు. ఈ పరిణామంతో రెవెన్యూ, పౌరసరఫరా అధికారుల్లో ఆందోళన మొదలైంది. డ్రైవర్లను బతిమలాడి వాహనాలను తీసుకెళ్లమని చెప్పి డీలర్లతో ప్రత్యేకంగా తిరుపతి, చిత్తూరులో సమావేశం నిర్వహించారు. సహకరించాలని కోరారు.
చేతులెత్తేసిన వాహన చోదకులు
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో సరకులు మేం పంపిణీ చేయలేమని వాహనాలు నడిపేవారు మంగళవారం చేతులెత్తేశారు. దీంతో లబ్ధిదారులకు రేషన్‌ అందలేదు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బండి దగ్గరకు వెళ్తేనే సరకులు పొందే పరిస్థితి పట్టణాల్లో నెలకొంది. వీధుల్లో రహదారిలో నిలిపేస్తున్నారు. మార్కాపురంలో వాహన డ్రైవర్లు పలు సమస్యలపై ఆర్డీవో శేషిరెడ్డికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు.

ap-main11b_20.jpg

రేషన్‌ పంపిణీకి సహకరించండి
ఇంటికే రేషన్‌ కార్యక్రమానికి డీలర్లు సహకరించాలని చిత్తూరు జిల్లా కలెక్టరు మార్కండేయులు కోరారు. మంగళవారం ఆయన జిల్లా చౌక దుకాణాల డీలర్ల సంఘం ముఖ్య ప్రతినిధులతో మాట్లాడారు.  రెండో రోజు హమాలీల సమస్యతో కొంత ఇబ్బందికరంగా ఉంది. డీలర్లు సహకరించాలి’ అని కలెక్టరు కోరారు.
విశాఖలో ఆందోళన
‘రేషన్‌ సరకులు మోయలేకపోతున్నాం.. సహాయకులను కేటాయించండి.. ఈపోస్‌ మిషన్‌ తీసివేసి నేరుగా సరకులు ఇచ్చేలా చర్యలు తీసుకోండి.. కేవలం 15 రోజులు మాత్రమే ఉద్యోగం ఉంటుందని చెప్పి ఇప్పుడు నెలలో 28 రోజుల వరకు పనిచేయాలనటం అన్యాయం’ అంటూ విశాఖ జోన్‌-1 ప్రాంతానికి చెందిన రేషన్‌ ట్రక్కు నిర్వాహకులు చినగదిలి మండల తహసిల్దార్‌ కార్యాలయం వద్ద వాహనాలు నిలిపి నిరసన తెలిపారు.

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఆదేశాలనే పాటిస్తున్నాం

ఈనాడు-అమరావతి: మొబైల్‌ వాహనంతోపాటు రేషన్‌ డీలర్లు ఉండకూడదు, అలా కుమ్మక్కయితే చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను తాము పాటిస్తున్నామని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. ‘వాహనంలో సరుకులు లోడ్‌ చేయించాలి, అలా చేయకపోతే లేఖ ఇవ్వండి, రాజీనామా అయినా చేయండని పేర్కొంటూ విశాఖపట్నం ఏఎస్‌ఓ ప్రసాద్‌ వాయిస్‌ మెసేజ్‌ పెట్టడాన్ని ఖండిస్తున్నాం. వాహనదారులతో పంపిణీ చేయించాలనే బాధ్యత ఆయనదే. అది పాటించకుండా డీలర్లను బెదిరించడం సరికాదు. రాతపూర్వకంగా ఇస్తే ఎలా స్పందించాలనే విషయమై ఆలోచిస్తాం’ అని వివరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...