Jump to content

షర్మిల బృందం అడిగిన ప్రశ్నలు


Somedude

Recommended Posts

Fans and slaves ravalamma -

 

1 తెలంగాణలో వైఎ్‌సఆర్‌ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏవి? వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? 

2. మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎ్‌సఆర్‌ చేసిన పనులు ఏంటి? 

3. మన రాజకీయ నిర్ణయం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? 

4. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌ను, టీఆర్‌ఎ్‌సను ఎలా ఎదుర్కోవాలి? దానికి మీరిచ్చే సలహా ఏంటి? 

5. రాష్ట్రంలో ఉన్న బీజేపీని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? దానికి మీరిచ్చే సలహాలు ఏంటి? 

6. తెలంగాణ సమాజం/ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి? వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి? 

7. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో పోరాడాల్సిన అంశాలు ఏంటి? 

8. సంస్థాగతంగా బలపడేందుకు, క్యాడర్‌ను నిర్మించుకోవడానికి చేయాల్సిన పనులు ఏంటి? 

9. సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే మీరిచ్చే సలహాలేంటి? 

 

 

Link to comment
Share on other sites

  • ఇక్కడి ప్రజలు వైఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నారు
  • ఆయన కోసం ప్రాణాలొదిలిన వారూ ఎక్కువే
  • హైదరాబాద్‌, రంగారెడ్డి నేతలతో షర్మిల
  • పార్టీ ఏర్పాటుపై ప్రజలేమనుకుంటున్నారు?
  • టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఎలా ఎదుర్కొందాం?
  • ఉద్యమకారుల నుంచి ప్రశ్నలేముంటాయి?
  • స్థానికంగా పోరాడాల్సిన అంశాలేంటి?
  • వైఎస్‌ అభిమానులకు షర్మిల ప్రశ్నావళి

02212021013802n9.jpg

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): పేద ప్రజల కోసం ఎంతో చేసిన వైఎ్‌సఆర్‌ను తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని ఆయన కుమార్తె షర్మిల అన్నారు. అందుకే ఆ మహానేత చనిపోయినప్పుడు దుఃఖం భరించలేక ప్రాణాలు వదిలేసిన వారిలో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారన్నారు. శనివారం లోట్‌సపాండ్‌లో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె జై తెలంగాణ, జోహార్‌ వైఎ్‌సఆర్‌ అంటూ నినదించారు. సమావేశం ప్రారంభానికి ముందు వైఎ్‌సఆర్‌ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ వైఎ్‌సఆర్‌ ప్రేమించారన్నారు. ప్రతి రైతు రాజు కావాలని, పేద విద్యార్థి ఉచితంగా గొప్ప చదువులు చదవాలని, పేదవాని ఆరోగ్యానికి భరోసా లభించాలని, పక్కా ఇల్లూ ఉండాలని వైఎ్‌సఆర్‌ కోరుకున్నారని చెప్పారు. మళ్లీ రాజన్న రాజ్యం, రాజన్న సంక్షేమ పాలన తెలంగాణలో మళ్లీ తేవాలన్నది తన కోరికని చెప్పారు. అందరూ తోడుంటే అది సాధ్యమవుతుందని నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. రాజన్న బిడ్డ పిలవగానే ఆశీర్వదించేందుకు, తోడు నిలవడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. 

 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందా? పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంది? తదితర వివరాలు తెలపాలని వచ్చిన వారిని కోరారు. వారి అభిప్రాయాలను వినేందుకే ఆమె సమయం కేటాయించారు. అందరి అభిప్రాయం తీసుకొనేందుకు ఏకంగా ఒక ప్రశ్నావళిని రూపొందించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అభిమానులు స్పందిస్తూ, తెలంగాణలో పార్టీ పెడితే అందరమూ వెంట నడుస్తామన్నారు. కేసీఆర్‌కు, బీజేపీకి సరైన సమాధానం చెప్పాలనీ షర్మిలను కోరారు. చేవెళ్ల చెల్లెమ్మ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళుతున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డ్రైనేజీలకు సంబంధించి వైఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీఆర్‌ఎస్‌ హయాంలో ఏమీ జరగలేదని నగరానికి చెందిన నేత తెలిపారు. స్కూలు ఫీజులపై నియంత్రణ లేదని, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం సరిగా అమలు జరగట్లేదని, ఆరోగ్యశ్రీ పథకం, 108, 104లూ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఇంతవరకు అమలు చేయలేదని, వైఎస్‌ హయాంలో తీసుకువచ్చిన 4 శాతమే అమలవుతోందని ముస్లిం నేతలు తెలిపారు. వైఎస్‌ పాలనలో స్కీములు గుర్తుకు వస్తే.. కేసీఆర్‌ పాలనలో స్కాములు గుర్తుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నేతలు భూ కబ్జాలకూ పాల్పడుతున్నారని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.

 

02212021013819n61.jpg

 

లోటస్‌ పాండ్‌ బయట కోలాహలం

లోట్‌సపాండ్‌లో షర్మిల సమావేశం నడుస్తుండగానే బయట వైఎ్‌సఆర్‌ అభిమానుల కోలాహలమూ కొనసాగింది. ఆత్మీయ సమావేశం అనంతరం బయటికి వచ్చి వేదికపై నుంచి షర్మిల అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు.. ఆమెకు గజమాలను సమర్పించారు. కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కుమారుడు రవి శుక్రవారం వై.ఎ్‌స.షర్మిలను కలిశారు. శనివారం లోట్‌సపాండ్‌లో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమావేశానికి కూడా హాజరైనట్లు తెలిసింది. రవి భార్య భవానీ నవాబుపేట ఎంపీపీగా ఉన్నారు. షర్మిలపెట్టే కొత్త పార్టీలో చేరే యోచనలో రవి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తాము టీఆర్‌ఎ్‌సలోనే ఉంటామని ఆయన తెలిపారు. 

 

మన నిర్ణయం గురించి ప్రజలేమనుకుంటున్నారు? 

తెలంగాణలో పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న షర్మిల అభిమానుల నుంచి అన్ని కోణాల్లో సమాచారం తీసుకుంటున్నారు. లోటస్‌ పాండ్‌లో వివిధ వర్గాలను కలుస్తున్న ఆమె సమాచారాన్ని సేకరించడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. శనివారం జరిగిన హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నేతల ఆత్మీయ సమావేశంలోనూ తాను తక్కువగా మాట్లాడి, నేతల నుంచి అభిప్రాయ సేకరణజరిపారు. తాను అనుకున్న కోణాల్లో సమాచార సేకరణ కోసం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నేతలందరికీ ప్రశ్నావళిని పంపిణీ చేశారు. ఆ ప్రశ్నల కింద సమాధానం రాసేందుకు చోటు ఉంచారు. తద్వారా మనసులో ఉన్న భావనలను పేపర్‌పైన పెట్టే అవకాశం కల్పించారు. ప్రశ్నావళిలో పేరు, చిరునామా, నియోజకవర్గం, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్‌, వాట్సాప్‌ నెంబర్‌ వివరాలనూ అడిగారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...