Jump to content

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀                     జ్యేష్టాలక్ష్మి.                     ➖➖➖✍️ అందరూ ‘మాకు దారిద్ర్యం పట్టింది. దరిద్రం పట్టింది ‘అని పిలుస్తుంటారు. ఈ జ్యేష్టాలక్ష్మీ మంత్రం చేస్తే ప్రారబ్దాలు తొలగిపోతాయి.


afacc123

Recommended Posts

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                    జ్యేష్టాలక్ష్మి.  
                  ✍️

అందరూ ‘మాకు దారిద్ర్యం పట్టింది. దరిద్రం పట్టింది ‘అని పిలుస్తుంటారు. ఈ జ్యేష్టాలక్ష్మీ మంత్రం చేస్తే ప్రారబ్దాలు తొలగిపోతాయి. డబ్బు లేదని కాదు, మంచి భావన రాకపోవడం కూడా దరిద్రమే! 

మనకి అన్నీ ఉన్నాయి కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. ఏం ప్రయోజనం దీని వలన! దరిద్రం అంటే కేవలం ధనం, సంపద లేమి అని కాదు. సంపదలు ఉన్నా లేకపోయినా మనిషి ఆత్మతో ఎప్పుడూ ఐశ్వర్యవంతుడే! 

ఆ ఐశ్వర్యాన్ని పెంచాలి అంటే జ్యేష్టా దేవి మంత్రాన్ని బాగా చేస్తే అది మన ప్రారబ్దాలని తీసివేస్తుంది. ధనవృద్ధిని కోరుకునే వారు జ్యేష్టాదేవి మంత్రం జపం చేయాలి. అందరూ మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. జ్యేష్టా దేవి దరిద్ర దేవత అని ఆమెను అందరూ చేయరు. కానీ మహాలక్ష్మి ఇచ్చినా సరే ఈ జ్యేష్టా దేవి అనుమతి లేనిదే అది నిలవదు. కాబట్టి మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేసే వారు అందరూ జ్యేష్టా దేవి మంత్రాన్ని తప్పకుండా చేయాలి. ఇది మంత్ర శాస్త్ర రహస్యం. 

లక్ష్మీ మంత్రాన్ని మాత్రమే చేసి ఊరుకుంటారు. తాత్కాలికంగా ఆమె కొంత ఇచ్చినట్లు ఇచ్చి తర్వాత దానంతట తీసుకుపోతుంది. ఉండటం, తీసుకు పోవడం జ్యేష్టాదేవి చేతిలో ఉంది. ఇక ఈమె ఇస్తే లెక్క లేదు. లక్ష్మీదేవిని అడగాల్సిన పని లేదు. కానీ లక్ష్మీ దేవి ఇవ్వాలనుకున్నా జ్యేష్టాదేవి ఇష్టపడాలి. 

ఒక సారి జ్యేష్టా దేవి, లక్ష్మీ ఇద్దరూ పోటిపడి  నాఇష్టం లేనిదే ఏ భక్తునికైనా ఎలా ఇస్తావు అంటుంది జ్యేష్టా దేవి. ఆ చివరకు జ్యేష్టా దేవి వానికి దక్కేది కూడా దక్కకుండ్డా చేస్తుంది. జ్యేష్టా దేవి అంటే దారిద్ర్యం కాదు. ఆమె అనుగ్రహం ఉంటే మనం కోరిన ఐశ్వర్యం అంతా ప్రసాదిస్తుంది. 

* ఉద్యధ్భాస్కర సన్నిభా స్మితముఖీ రక్తాంబరాలేపనా |* 
సత్కుంభం ధనభాజనం సృణిమధో పాశంకరై బ్రిభ్రతీ || 

పద్మస్థా, కమలేక్షణా దృడకుచా సౌందర్య వారాం నిది,|
*ద్యాతవ్యా సకలాభిలాష ఫలదా శ్రీ జ్యేష్టలక్ష్మీరియం|| *

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వంటి కాంతి గల శరీరంతో , చిరునవ్వు చిందించే ముఖం తో , ఎర్రనైన వస్త్రములు ధరించి, సత్ కుంభం, ధనభాజనము, రక్తపాత్ర, పాశములను చేతుల యందు ధరించి ఉంది జ్యేష్టా లక్ష్మి. ధన భాజనము అంటే సంపద, ఐశ్వర్యం, రక్త పాత్ర అంటే దారిద్ర్యం. ఈ రెండూ ఎందుకు అంటే ప్రసన్నురాలైతే ఐశ్వర్యాన్ని, ఆగ్రహిస్తే దరిద్రం, కష్టాలు ఇస్తుంది. పద్మస్త అంటే పద్మములో కూర్చుని కమలేక్షణ పెద్ద పెద్ద కన్నులు కలిగిన, ధృఢకుచ అంటే పూర్ణమైన కుంభములవంటి స్థనములు కలిగిన, సౌందర్య వారాదిని చాలా అందంగా ఉంటుంది జ్యేష్టా దేవి. ఈ విధంగా ధ్యానం చేయాలి. సకలాభిలాష ఫలద అ విధంగా ప్రార్థన చేస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. సంపదని ప్రసాదిస్తుంది. ధనం ఒక్క లక్ష్మీ దేవే ఇస్తుంది. దరిద్రం తీసివేయలేదు. ఆ ధనాన్ని అనుభవించే యోగాన్ని , ప్రాప్తిని జ్యేష్టా దేవి కలిగిస్తుంది. ఈ జ్యేష్టాదేవి దారిద్ర్యం తీసివేస్తుంది. సందను ఇచ్చి అనుభవించేటట్లు చేస్తుంది. అందుకే ఆమెకు ఆధ్యలక్ష్మీ అని పేరు.

ఆర్థిక రసాయన శాస్త్రం తెలిసిన వ్యక్తులు ఏ అడ్డదారులలోనూ వెళ్ళకుండా ఏ విలువలను చంపుకోకుండా తక్కువ కాలంలో శ్రీమంతులు కావచ్చు. సమాజంలో లభించే అతి తక్కువ విలువ ను సమాజంలో బాగా డిమాండ్ ఉన్న అతి ఎక్కువ విలువ కింద మార్చగలిగే సామర్థ్యం, నైపుణ్యాన్ని ప్రదర్శించడమే ఆర్థిక రసాయన శాస్త్రం!✍️

*నోట్ :- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని ఎవరిని ఉద్దేశించి కాదు! *🙏

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...