Jump to content

Jagan anna gov inko mettu ekindi


psycopk

Recommended Posts

ఏపీలో మరో దారుణం.. రేపల్లే రైల్వే స్టేషన్ లో భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం 

01-05-2022 Sun 11:48
  • నిన్న అర్ధరాత్రి ఘటన
  • పనుల కోసం అవనిగడ్డకు ప్రయాణం
  • రేపల్లే రైల్వే స్టేషన్ లో దిగిన దంపతులు
  • బల్లపై పడుకున్న మహిళను లాక్కెళ్లిన దుండగులు
  • అడ్డొచ్చిన భర్తపై దాడి.. రంగంలోకి దిగిన ఎస్పీ
3 Men Raped Woman In Repalle

ఏపీలో మరో దారుణం జరిగింది. బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ లో కొందరు దుండగులు ఓ వ్యక్తిని చితకబాది.. అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన దంపతులు.. అవనిగడ్డలో పనుల కోసం వచ్చారు. రేపల్లే రైల్వే స్టేషన్ లో దిగారు. అర్ధరాత్రి కావడం.. రవాణా సదుపాయం లేకపోవడంతో స్టేషన్ లోని బల్లలపైనే పడుకున్నారు. 

ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను పక్కకు లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అడ్డుపడిన భర్తను చితకబాదారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

ఘటనపై బాపట్ల ఎస్పీ వకూల్ జిందాల్ స్వయంగా రంగంలోకి దిగారు. రేపల్లే పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు పాల్పడిన ముగ్గురు స్థానికులేనని సమాచారం. ఆ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Link to comment
Share on other sites

హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడటం దురదృష్టకరం: లోకేశ్‌ 

01-05-2022 Sun 11:55
  • మహిళల తప్పిదాలవల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడారన్న లోకేశ్‌
  • ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్.. పూటకో రేప్ అని విమ‌ర్శ‌
  • బీహార్ ను ఆంధ్రప్రదేశ్ మించిపోయింది అని ట్వీట్
lokesh slams ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఆయ‌న స్పందించారు. 

''ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్... పూటకో రేప్. బీహార్ ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై రేపల్లె రైల్వే స్టేషన్ లో కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

రాష్ట్రంలో ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాలవల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరం. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి'' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

రేపల్లే రైల్వే స్టేషన్ లో మ‌హిళ‌పై గ్యాంప్ రేప్ కేసుపై స్పందించిన సీఎం జ‌గన్ 

01-05-2022 Sun 12:44
  • పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానిత యువ‌కులు 
  • వారంతా రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారే
  • ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడిన జ‌గ‌న్
  • వివ‌రాలు అడిగి తెలుసుకున్న సీఎం
jagan responds on gang rape case

బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ లో గ‌త‌ అర్ధరాత్రి కొంద‌రు దుండ‌గులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ ముగ్గురు అనుమానిత యువ‌కులు రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారని తెలిసింది. 

ఆ రైల్వేస్టేషన్ సమీపంలోనే నేతాజీ నగర్ ఉంటుంది. మద్యం మత్తులో వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. కాగా, మహిళపై సామూహిక అత్యాచార‌ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న‌ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడి, వివ‌రాలు అడిగి తెలుసుకుని ప‌లు సూచ‌న‌లు చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...