Jump to content

Did they decide they lost it already, no shah or modi..


Peruthopaniemundhi

Recommended Posts

31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ... ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరు 

25-10-2022 Tue 19:52
  • ఇదివరకే మునుగోడు సభను ప్రకటించిన బీజేపీ
  • అధికారికంగా ప్రకటించిన బీజేపీ తెలంగాణ శాఖ
bjp states that jp nadda will participates in munugode meeting on31st of this month

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీలకు చెందిన తురుపు ముక్కలను ప్రయోగిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఈ నెల 31న మునుగోడులో బీజేపీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారంటూ ఆ పార్టీ తెలంగాణ శాఖ మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది.

ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, లేదంటే జేపీ నడ్డా గానీ హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు ఇదివరకే వెల్లడించారు. మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టింది. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని నేపథ్యంలో జేపీ నడ్డా ఈ సభకు రానున్నారు. జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారు కావడంతో మంగళవారం బీజేపీ తెలంగాణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...