Jump to content

దసపల్లా భూముల స్వాహాకు సిద్ధం


southyx

Recommended Posts

                                           దసపల్లా భూముల స్వాహాకు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

Published : 17 Nov 2022 05:57 IST
 
 
 
 
 
 

యంత్రాంగంపై కీలక నేత ఒత్తిడి
ఆగమేఘాలపై సబ్‌ డివిజన్‌ పూర్తి

161122ap-main5a.jpg

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనిపై కీలక నిర్ణయం తీసుకొనే దిశగా అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది. ఈనెల 13న ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖలో బస చేసిన వైకాపా ముఖ్యనేత అధికారులతో ఈ భూముల డీనోటిఫికేషన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌లతో పాటు జీవీఎంసీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, సర్వేశాఖ అధికారులు 1027, 1028, 1196, 1197 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న 60 ఎకరాల దసపల్లా భూములను పరిశీలించారు. వాటిలో కొన్నింటిని ఇప్పటికే సేకరించి పరిహారం చెల్లించారు. అలా సేకరించిన భూమి 40 ఎకరాల వరకు ఉంది. అవి ఎక్కడ ఉన్నాయి? రాణి కమలాదేవి నగరంలో 65 మందికి విక్రయించిన భూములు ఎక్కడ ఉన్నాయి? గవర్నర్‌ బంగ్లా, నౌకాదళ భవనానికి చెందిన స్థలాలు ఏయే సర్వే నంబర్లలో విస్తరించి ఉన్నాయి? జీవీఎంసీ నిర్మించిన రెండు నీటి ట్యాంకులు, సులభ్‌ శౌచాలయం, వీఎంఆర్‌డీఏ వేసిన రోడ్లు, పార్కులు ఏయే సర్వే నంబర్లలో ఉన్నాయో తేల్చాల్సి ఉంది. ఇవి తేలాలంటే సబ్‌ డివిజన్‌ పనులు పూర్తి కావాలి. దీంతో ఆగమేఘాలపై ఇటీవల సబ్‌ డివిజన్‌ పనులు పూర్తి చేశారు.

యంత్రాంగమంతా ఇదే పనిలో..

నాలుగైదు రోజుల నుంచి కలెక్టర్‌, జేసీలు తరచూ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, సర్వేశాఖ అధికారులతో భేటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇంతకన్నా కీలకమైన పనులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి గట్టి ఆదేశాలు రావడంతో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ దసపల్లా భూముల్లో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ భవనాలు, పార్కులు, రహదారులు, ఇతర కట్టడాల వివరాలను అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆయా వివరాలు అందిన వెంటనే ప్రభుత్వ ఆస్తులను 22ఏలో ఉంచి, మిగిలిన భూములను మినహాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కసరత్తు నాలుగైదు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కలెక్టర్‌ దసపల్లా భూములను డీనోటిఫై చేసి ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రజల అభ్యంతరాలు బేఖాతరు

జిల్లాలో వేలమంది తమ భూములను 22ఏ నుంచి మినహాయించాలని వినతులు ఇస్తున్నారు. విశాఖలో మురళీనగర్‌, రేసపువానిపాలెం, మద్దిలపాలెం తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సబ్‌ డివిజన్‌ కాకపోవడంతో వేలమంది ఇప్పటికీ తమ ఆస్తులను 22ఏ చట్రం నుంచి మినహాయించుకోలేకపోతున్నారు. ఆయా అంశాలను పట్టించుకోని యంత్రాంగం.. ఆగమేఘాలపై దసపల్లా భూముల వ్యవహారాన్ని చక్కబెడుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ భూములపై గత ప్రభుత్వాలు న్యాయపోరాటం చేశాయి. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఆరేళ్ల క్రితం వచ్చిన కోర్టు తీర్పులను అడ్డు పెట్టుకుని భూముల స్వాహాకు వైకాపా కీలక నేత మంత్రాంగం నడిపారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్‌ నుంచి దిగువ స్థాయి అధికారి వరకు డీనోటిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టడంపై అధికార వర్గాలూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖలో ప్రధాని సభ ముగిసిన మరుసటి రోజు నుంచే రెవెన్యూ, సర్వే, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఏ కోణంలోనూ దసపల్లా భూములను రక్షించడంపై అధికారులు దృష్టి సారించలేదు. పైగా నీటి ట్యాంకులు, శౌచాలయం, రహదారులు, పార్కుల పరిరక్షణకు దసపల్లా భూములను సబ్‌డివిజన్‌ చేసి 22ఏ నుంచి మినహాయిస్తున్నామని కొత్త వాదన తెస్తున్నారు. ఇక గవర్నర్‌ బంగ్లా, నౌకాదళ భవనానికి సేకరించిన భూములకు 1969లోనే అవార్డులు జారీ చేసి పరిహారం చెల్లించారు. అప్పట్లోనే వాటిని సబ్‌ డివిజన్‌ చేసి 22ఏ నుంచి మినహాయించాల్సి ఉంది. అది జరగకపోవడంతో ఇప్పుడు చేస్తున్నారు. అంతేతప్ప తాజాగా అధికారులు చేస్తున్నదేం లేదని ఆయా వర్గాలు వివరిస్తున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...