Jump to content

1lk postcards to president on India about CBN arrest as protest


psycopk

Recommended Posts

  • psycopk changed the title to 1lk postcards to president on India about CBN arrest as protest

Bonda Uma: దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగన్, పేదవాడి ముసుగు వేసుకుంటున్నాడు: బోండా ఉమ 

10-10-2023 Tue 14:49 | Andhra
  • వై ఏపీ నీడ్స్‌ జగన్ కు టీడీపీ కౌంటర్ ఏపీ హేట్స్ జగన్
  • ప్రజలంతా జగన్‌ను వద్దు బాబోయ్ అంటున్నారన్న బోండా ఉమ
  • రూ.7 లక్షల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణ
  • సాక్షి పేపర్, సాక్షి టీవీ, భారతీ సిమెంట్స్ ఎవరివి? అని నిలదీసిన బోండా ఉమ
 
Bonda Uma fires at YS Jaganmohan Reddy

రాష్ట్ర ప్రజలు 'ఏపీ హేట్స్ జగన్' అంటున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో వైసీపీ ప్రచారానికి సిద్ధమవుతుండగా, టీడీపీ ఏపీ హేట్స్ జగన్ పేరుతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం ఉమా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు జగన్‌ను ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. వైసీపీ చెబుతున్నట్లుగా ఏపీ నీడ్స్ జగన్ కాదని, ఏపీ హేట్స్ జగన్ అని చురక అంటించారు. ప్రజలంతా జగన్ వద్దు బాబోయ్ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు.

వైసీపీ ప్రతినిధుల సభలో జగన్ అన్నీ అవాస్తవాలు మాట్లాడారన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్ మూడు రాజధానులు కడతారా? అని నిలదీశారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10 నుంచి 15 మందికి మాత్రమే దక్కినట్లు చెప్పారు. రూ.10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కనీసం రూ.7 లక్షల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వైద్య, విద్యా రంగాలను జగన్ భ్రష్టు పట్టించారన్నారు. నిన్న జగన్ మాట్లాడుతూ తాను పేదవాడిని, తనకు ఏమీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రుల్లో జగన్ మొదటిస్థానంలో ఉన్నారని ఏడీఆర్ సర్వే చెప్పలేదా? అని ప్రశ్నించారు. అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్ పేదలను, ప్రజల్ని మాయచేసి ఓటు వేయించుకోవడానికి ఈ రోజు తాను పేదవాడు అనే ముసుగు వేసుకోవాలని చూస్తున్నాడన్నారు. సాక్షి పేపర్, టీవీ, భారతీ సిమెంట్స్.. ఇవన్నీ ఎవరివని నిలదీశారు.

సర్వనాశనం చేసిన జగన్ ఇంకా ఎందుకు? అని ప్రజలు అడుగుతున్నారని గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో నిలదీస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకుంటున్నందునే ఏం చేయలేక బస్సుయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకున్న జగన్ దళిత పక్షపాతి ఎలా అవుతారని నిలదీశారు. దేశం మొత్తంలోనే 600 హామీలు ఇచ్చి, ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రిగా జగన్ రికార్డుకెక్కారని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రాకముందు దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్, నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేశారన్నారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం కారణంగా లక్షమందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీ జే బ్రాండ్ మద్యం కొనలేక పేదవాడి జేబు ఖాళీ అయిందన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్ని వర్గాల యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారన్నారు. నీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో కియా, అమరరాజా, సెల్ కాన్, లూలూ సహా పలు ఐటీ పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయన్నారు. నీ పరిపాలన చూసి ఈ కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Atchannaidu: బీసీల గొంతు నొక్కడమే జగన్ లక్ష్యమా? గాలి పీల్చుకోవాలన్నా జగన్ పర్మిషన్ కావాలంటారేమో!: అచ్చెన్నాయుడు 

10-10-2023 Tue 14:42 | Andhra
  • జగన్ బీసీల ద్రోహి అన్న అచ్చెన్నాయుడు
  • కాల్వ శ్రీనివాసులుపై వరుస కేసులు పెడుతున్నారని మండిపాటు
  • పోలీసులను జగన్ ప్రైవేట్ సైన్యంలా మార్చుకున్నారని విమర్శ
 
Jagan is anti BC says Atchannaidu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బీసీ ద్రోహి అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ ను ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ తనలోని పెత్తందారీతనాన్ని మరొక సారి రుజువు చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయమని దుయ్యబట్టారు. అన్ని కేసుల్లోనూ కావాలనే మొదటి ముద్దాయిగా చేరుస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. 

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్ట్ లు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. 

చట్టాన్ని చుట్టంలా వాడుకుంటున్న జగన్... పోలీసులను వైసీపీకి ప్రైవేటు సైన్యంలా మార్చుకుని అరాచకానికి నాంది పలుకుతున్నారని అన్నారు. బీసీలు గాలి పీల్చాలన్నా జగన్ పర్మిషన్ కావాలని అంటారేమోనని మండిపడ్డారు. జగన్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పలికే సమయం ఆసన్నమయిందని చెప్పారు. ఏపీ నీడ్స్ జగన్ అని కాకుండా... ఏపీ హేట్స్ జగన్ అంటూ ప్రజలు పిలుపునిస్తున్నారని అన్నారు. 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...